News October 10, 2025

యాదాద్రి: ఫోన్‌లో మాట్లాడి.. ఉరేసుకున్న యువకుడు.!

image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ నల్ల శంకర్ (22) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 9 రాత్రి తల్లిదండ్రులు వేరే ఇంటికి వెళ్లగా, శంకర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈరోజు ఉదయం 6 గంటలకు వంటగది పైకప్పుకు చీరతో ఉరేసుకుని కనిపించాడు. ఓ అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని ఫిర్యాదు అందినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 11, 2025

SKLM: ‘సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

image

సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం పట్టుబడి ఉందని ఆముదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూన, రవికుమార్ గొండు శంకర్ అన్నారు. జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించి ప్రివెన్షన్ ఆక్ట్‌పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ,ఎస్టీలకు ఎటువంటి అన్యాయం జరిగినా తక్షణం చర్యలు తీసుకోవాలని వారు అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News October 11, 2025

ఏలూరులో ఈనెల 13 ‘జీఎస్టీ హేలాపురి ఉత్సవం’

image

ఏలూరు జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి శుక్రవారం గూగుల్ మీట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 13 నుంచి 19 వరకు వారం రోజుల పాటు జరిగే ‘జీఎస్టీ హేలాపురి ఉత్సవం’ను పండుగ వాతావరణంలో విజయవంతం చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సీఆర్ రెడ్డి కళాశాలలో జరగబోయే కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

News October 11, 2025

ఆదిలాబాద్: సోమవారం యథావిధిగా ప్రజావాణి

image

ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. ప్రజలు వినతులను స్వీకరించేందుకు ప్రజావాణిని తిరిగి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.