News September 14, 2025

యాదాద్రి భక్తుల సౌకర్యార్థం కియోస్క్ యంత్రాలు

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆరు కియోస్క్ యంత్రాలను ఈవో వెంకట్రావు ప్రారంభించారు. కెనరా బ్యాంక్ విరాళంగా అందించిన ఈ యంత్రాల ద్వారా భక్తులు క్యూలో నిలబడకుండానే దర్శనం, ప్రసాదాలు, వ్రతాల టికెట్లను డిజిటల్ పద్ధతిలో నేరుగా పొందవచ్చు. ఈ డిజిటల్ సేవలతో భక్తుల సమయం ఆదా అవడంతో పాటు, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Similar News

News September 14, 2025

VKB: టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వికారాబాద్‌ కలెక్టరేట్ కార్యాలయంలో కొనసాగుతున్న మోమిన్‌పేటలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ బోధించడానికి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. ఎంఎస్సీ, బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 16న నిర్వహించే ఇంటర్వ్యూ, డెమో క్లాస్‌కు హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు 6301013028, 7981718918ను సంప్రదించాలని సూచించారు.

News September 14, 2025

కొందరు MLAలు అసెంబ్లీకి రాకున్నా జీతం తీసుకుంటున్నారు: అయ్యన్న

image

AP: కొందరు MLAలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ‘ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికే. ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్ ఆలోచించి, మార్గదర్శకాలివ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది 45రోజులు.. వాటికీ రాకపోతే ఎలా’ అని ప్రశ్నించారు.

News September 14, 2025

MBNR:జాతీయ మెగా లోక్ అదాలత్..UPDATE

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒సైబర్ కేసులు:97(₹32,19,769/- రీఫండ్)
✒కాంప్రమైజ్ కేసులు:193
✒ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు(డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act):564
✒ఐపీసీ(అండర్ ఇన్వెస్టిగేషన్/కోర్టు విచారణలో ఉన్నవి): కేసులు-253
✒మొత్తం పరిష్కరించబడిన కేసులు: 2,597