News October 13, 2025
యాదాద్రి: భారీ వర్షం.. తడిసిన ధాన్యం

జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్న తరుణంలో, సోమవారం తెల్లవారుజామున ఊహించని విధంగా భారీ వర్షం దంచికొట్టింది. దీంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ, ధాన్యాన్ని మార్కెట్కు చేర్చి ఆముదం అనుకుంటున్న సమయంలో వర్షం రావడంతో రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 13, 2025
మెదక్: వరికి తెగులు.. రైతులకు గుబులు

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన వాతావరణ మార్పుల కారణంగా పలు గ్రామాల్లో వరి పంటకు కోత దశలో తెగులు సోకింది. మెడ విరుపు, కంకి నల్లి, దోమపోటు సోకి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదివరకు వర్షాల కారణంగా చాలా వరకు నష్టపోయిన రైతులు తెగులు కారణంగా పూర్తి దశలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి తెగుల కారణంగా ఏరులో వేసినట్లుగా ఉందన్నారు.
News October 13, 2025
జగిత్యాల: స్కాలర్షిప్స్.. 3 రోజులే ఛాన్స్..!

BD కార్మికుల పిల్లల స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు ఈనెల 15తో ముగుస్తుందని BD కార్మికుల దవాఖాన వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. బీడీ కార్మికుల పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 30తో గడువు ముగియాల్సి ఉండగా మరోసారి లాస్ట్ డేట్ను 15కు పొడిగించారు.
News October 13, 2025
HZB: ఈనెల 17న స్పెషల్ యాత్రా బస్సు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హుజూరాబాద్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 17న ఉదయం 5 గంటలకు లక్నవరం, రామప్ప, మేడారం, మల్లూరు నరసింహస్వామి ఆలయాలకు ఒకరోజు యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పెద్దలకు రూ.800, పిల్లలకు రూ.430 టికెట్ చార్జీలతో స్పెషల్ బస్సు వెళుతుందన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం 9959225924, 9704833971 నంబర్లను సంప్రదించాలన్నారు.