News February 24, 2025

యాదాద్రి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News December 31, 2025

కోనసీమ: డిసెంబర్ 31 @ మందుబాబుల చిందులకు వేళాయే!

image

మద్యం ప్రియులకు ప్రతిరోజు పండగే. అయితే డిసెంబర్ 31న మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆరోజు వీరు సృష్టించే హడావిడి అంతాఇంతా కాదు. మద్యం వ్యాపారాలు రోజుకంటే 10రెట్లు పైబడి మద్యం నిల్వలు ఉంచుతారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ తెల్లవార్లు మద్యం మత్తులో తాగి తూలుతూ చాలామంది తాగుబోతులు. అయితే నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News December 31, 2025

అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

image

అయోధ్య రామమందిర రెండో వార్షికోత్సవం వేళ సీఎం చంద్రబాబు పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తి రేపింది. ఉత్తరాది భక్తులు ఆయనను ‘హైటెక్ సిటీ సీఎం’గా, మోదీ మిత్రుడిగా గుర్తించి బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి, ధర్మం అనే రెండు చక్రాలపై ఆయన రాజకీయం సాగుతోందని జాతీయ మీడియా విశ్లేషించింది. ‘రామరాజ్యమే పాలనకు ప్రామాణికం’ అని బాబు వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

News December 31, 2025

పల్నాడులో రహదారులకు మహర్దశ

image

పల్నాడు జిల్లాలో రహదారులకు 2025 ఏడాది మహర్థశ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొండమోడు- పేరేచర్ల మధ్య జాతీయ రహదారి పట్టాలెక్కింది. గుంటూరు వైపు నుంచి హైదరాబాదుకు వెళ్లేందుకు ఈ మార్గం అత్యంత ప్రాధాన్యతతో ఉంది. రాజధాని అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రైల్వే లైన్ పల్నాడు జిల్లా మీదుగా వెళ్లే ప్రణాళిక సిద్ధం అయ్యాయి. మాచర్ల ఎత్తిపోతలకు సంబంధించి జిప్‌లైన్ పనులను ప్రారంభించారు.