News October 9, 2025

యాదాద్రి: మొదటి విడత ఎన్నికలు ఇక్కడే..

image

భువనగిరి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఆలేరు, రాజపేట, మోటకొండూరు, యాదగిరిగుట్ట, తుర్క పల్లి(ఎం), బొమ్మలరామారం, గుండాల, ఆత్మకురు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ ఈ ప్రక్రియ ఎంపీడీవో కార్యాలయాలలో కొనసాగుతుందన్నారు.

Similar News

News October 9, 2025

ములుగు: పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు

image

పొక్సో కేసులో ఒకరికి జీవిత కైదు విధించినట్లు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు.. ఏటూరునాగారానికి చెందిన నిందితుడు మంతెన రామయ్యపై నమోదు చేసిన పొక్సో కేసు నేరం నిరూపితమైంది. ఈ మేరకు కోర్టు జీవిత ఖైదు, 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా విధించింది. అదే విధంగా బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

News October 9, 2025

బేసిక్ పోలీసింగ్‌ మర్చిపోయారు: డీజీపీ

image

TG: రాష్ట్రంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో బేసిక్ పోలీసింగ్‌ను మర్చిపోయారని DGP శివధర్ వ్యాఖ్యానించారు. ‘ఇకపై రెండూ ఉండాలి. వాహనాల చెకింగ్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పాటు ఇంటెలిజెన్స్ సేకరణకు ప్రాధాన్యమివ్వాలి. కిందిస్థాయి నుంచే ఇంటెలిజెన్స్ సేకరించాలి. శాంతిభద్రతల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోలీసులకు పార్టీలతో సంబంధం లేదు. ప్రజల రక్షణే ధ్యేయం’ అని SPలు, కమిషనర్ల సమావేశంలో మాట్లాడారు.

News October 9, 2025

పాత మహిళా పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఎస్పీ

image

అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పాత మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎస్పీ జగదీశ్ గురువారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించి, ఆ స్థలంలో నూతన భవనాలు నిర్మిస్తే పోలీస్ శాఖకు ఉపయోగంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం సిబ్బంది క్వార్టర్స్, ఖాళీ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు.