News February 7, 2025
యాదాద్రి: యువతకు ఉచిత శిక్షణ..

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలో స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ లక్ష్మీ తెలిపారు. ఎలక్ట్రిషన్, సోలార్ సిస్టం ఇన్స్టలేషన్ & సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్, సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సీసీటీవీ టెక్నీషియన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోసి తదితరాలపై ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News September 19, 2025
మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్

భారత్, PM మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మోదీతో మంచి స్నేహం ఉందని, ఆ కారణంగానే ఆయనకు నిన్న బర్త్ డే విషెస్ తెలిపానన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తేనే రష్యా దిగి వస్తుందని చెప్పారు. చైనా ఇప్పటికే అమెరికాకు భారీ టారిఫ్లు చెల్లిస్తోందని, మరిన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
News September 19, 2025
RG-3: యాజమాన్యం మొండి వైఖరి వల్లే సమావేశం బహిష్కరణ

సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వల్లే స్ట్రక్చరల్ సమావేశాన్ని ఏఐటియుసి బహిష్కరించారని జనరల్ సెక్రటరీ కె.రాజ్ కుమార్ అన్నారు. గురువారం RG-3 ఏరియా OCP-2లో నిర్వహించిన గేట్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయాలని, కార్మికులకు 35శాతం లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైవీ రావు,MRC రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News September 19, 2025
YSR మరణంతోనే రాష్ట్ర విభజన: రాజగోపాల్రెడ్డి

YSR మరణంతోనే రాష్ట్ర విభజన జరిగిందని రాజగోపాల్రెడ్డి అన్నారు. గుంటూరు పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా వెనుక ఇంటెలిజెన్స్ ఉందని, నేను పార్టీ మారుతున్నానని, మాజీ CM జగన్ను కలుస్తున్నానని కొందరు ప్రచారం చేశారు. నేను రాజకీయ నాయకుడిగా కాకుండా, సోదరుడిగా APకి వచ్చాను. నేను YSR అభిమానినని, ఒక మనిషి మరణిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు’ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.