News March 15, 2025
యాదాద్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి (UPDATE)

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద <<15765722>>రోడ్డుప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన రమేష్ (34) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
భగవంతుని నామస్మరణ గొప్పతనం ఏంటంటే..?

భగవంతుడి నామస్మరణ ఎంతో మహత్తరమైనది. ఆ నామాన్ని భక్తితో, వైరాగ్యంతో మాత్రమే కాక, కోపంతో, అలవాటుగా, అనాలోచితంగా పలికినా కూడా సకల శుభాలనూ, మోక్ష ఫలాలనూ అందిస్తుంది. భావనతో సంబంధం లేకుండా ఆ నామ సంకీర్తన నిరంతర శుద్ధిని కలిగిస్తుంది. అంతిమంగా జీవునికి మేలు చేకూర్చుతుంది. అందుకే ఆయన పేరుతో ఆయణ్ను దూషించినా.. అది దైవ నామ స్మరణే అవుతుందని పండితులు చెబుతుంటారు. భగవత్ నామానికి ఉన్న అద్భుత శక్తి ఇది.<<-se>>#Bakthi<<>>
News October 26, 2025
ఫుడ్ పాయిజనింగ్ కావొద్దంటే ఇవి మస్ట్!

TG: రాష్ట్రంలో గత 9 నెలల్లో 34K+ ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. దీనికి కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ‘బయటి ఫుడ్, ఫ్రిడ్జిలో నిల్వ ఉంచిన ఆహారం తినొద్దు. వాడిన నూనె మళ్లీ వాడొద్దు. శుభ్రత పాటించాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. తినే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడగాలి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించాలి’ అని సూచిస్తున్నారు.
News October 26, 2025
MNCL: 27న మద్యం దుకాణాల కేటాయింపు

నూతన మద్యం పాలసీ విధానం 2025- 27లో భాగంగా మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పివిఆర్. గార్డెన్స్ లో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధ శాఖ అధికారి నందగోపాల్ తెలిపారు. దరఖాస్తుదారులు సకాలంలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.


