News October 5, 2025
యాదాద్రి: శిక్షణకు రాని ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 6న ప్రతి మండల కేంద్రంలో నిర్వహించే శిక్షణా తరగతులకు ప్రిసైడింగ్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శిక్షణకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లీవ్లో ఉన్నవారు సైతం లీవ్ను రద్దు చేసుకుని విధిగా శిక్షణకు రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News October 5, 2025
ములుగు జిల్లాలో కొనసాగుతున్న ఎల్లో అలర్ట్

ములుగు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 25.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటున ప్రతి మండలంలో 2.7 సెంటీమీటర్ల వాన పడింది. అత్యధికంగా ఏటూరునాగారం మండలంలో 10.8 సెంటీమీటర్లు, వాజేడులో 3.4, మంగపేటలో 3.0, వెంకటాపురంలో 2.5, ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి మండలాల్లో 1.1 సెంటీమీటర్ చొప్పున వర్షం పడింది. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 5, 2025
వంటింటి చిట్కాలు

✍️ మటన్ మెత్తగా ఉడకాలంటే చిన్న కొబ్బరి ముక్కను పెంకుతో సహా వేయాలి. మాంసం కూరలో నీరు ఎక్కువైతే చెంచా కాన్ఫ్లవర్ కలిపి ఉడికిస్తే చిక్కబడి రుచిగా ఉంటుంది.
✍️ పూరీల పిండిలో 4 చెంచాల పెరుగువేసి బాగా కలిపితే పూరీలు నూనె తక్కువ పీల్చుకుంటాయి. అలాగే బంగారు రంగులో మెరుస్తూ పొంగుతాయి.
✍️ వాష్ బేసిన్లో రంధ్రాలు మూసుకుపోయినప్పుడు వేడి నీటిలో కాస్త ఉప్పు కలిపి పోస్తే శుభ్రమవుతుంది.
<<-se>>#VantintiChitkalu<<>>
News October 5, 2025
VJA: దారుణ హత్య.. డ్రైనేజీల్లో మహిళ శరీర భాగాలు

విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ సైకో థ్రిల్లర్ సినిమా తరహాలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. నగరంలోని వివిధ డ్రైనేజీల వద్దకు ఆ మహిళ శరీర భాగాలు కొట్టుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మహిళను హతమార్చి, ముక్కలు ముక్కలుగా నరికి డ్రైనేజీల్లో కలిపారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.