News January 28, 2025
యాదాద్రి శ్రీవారికి రూ.1,11,116/- విరాళం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య విమాన రాజగోపురానికి బంగారు తాపడం నిమిత్తం ఎన్.వేణుగోపాల్ రావు రూ.1,11,116 చెక్కును విరాళంగా మంగళవారం ఆలయ ఏఈఓ రమేశ్కు అందజేశారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందజేశారు.
Similar News
News October 27, 2025
నిర్మల్: ‘ప్రజా ఫిర్యాదులను పరిష్కరిస్తాం’

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్న ఫిర్యాదులను ఫునఃపరిశీలించి తగిన విధంగా పరిష్కార మార్గాలు చూపుతామని అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. గ్రామీణ, పట్టణ స్థాయి, వ్యవసాయ భూముల సంబంధిత దరఖాస్తులు అధికంగా వస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల సిబ్బంది పనితనం మెరుగుపరచుకోవాలన్నారు.
News October 27, 2025
తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

AP: తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, 25 కేజీల బియ్యం సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూడాలని, ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు.
News October 27, 2025
నిర్మల్: యూ డైస్ వివరాలను నమోదు చేయాలి: డీఈవో

ప్రతీ పాఠశాల యూ డైస్లో వివరాలను ఖచ్చితంగా, సరియైన విధంగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. నిర్మల్ కొండాపూర్లో గల ఓ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. యూ డైస్లో గల మూడు రకాల మాడ్యూల్లలో పాఠశాల వివరాలను, పాఠశాలలో ఉన్న సౌకర్యాలను, విద్యార్థుల సంబంధించిన వివరాలను ఉపాధ్యాయుల వివరాలను పరిశీలించాలన్నారు.


