News March 27, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ.1,01,350, VIP దర్శనాలు రూ.75,000, బ్రేక్ దర్శనాలు రూ.1,05,000, ప్రసాద విక్రయాలు రూ.7,30,470, కళ్యాణకట్ట రూ.64,000, సువర్ణ పుష్పార్చన రూ.38,632, కార్ పార్కింగ్ రూ.2,19,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.27,24,822 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

Similar News

News December 30, 2025

REWIND-2025: విశాఖ అభివృద్ధిలో కీలక మలుపు

image

2025లో ఉమ్మడి విశాఖ అభివృద్ధి దిశగా కీలక మలుపు తిరిగింది. ఐటీ, పరిశ్రమలు, మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ఆర్థిక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఏడాది విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అంశంగా గూగుల్ డేటా సెంటర్ ప్రకటన నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదిత మిట్టల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమల రంగంలో కొత్త ఆశలు రేపింది. మొత్తంగా 2025 విశాఖ అభివృద్ధి పునాదులు వేసిన ఏడాదిగా నిలిచింది.

News December 30, 2025

పర్యాటకులతో కిక్కిరిసిన విశాఖ.. జనవరి 4 వరకు ఇదే పరిస్థితి!

image

విశాఖ నగరానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. నూతన సంవత్సరం, వరుస సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో పర్యాటకులు విశాఖకు తరలివచ్చారు. నగరంలో ఉన్న 30 స్టార్ హోటళ్లలోని 2,400 గదులు, అలాగే బడ్జెట్ హోటళ్లలోని దాదాపు 5,000 గదులు 90 శాతం ఆక్యుపెన్సీతో నిండిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏపీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కార్తీక్ తెలిపారు.

News December 30, 2025

31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 303 కొత్త పెన్షన్లతో కలిపి మొత్తం 2,28,592 పెన్షన్లకు రూ.98.95 కోట్లు పంపిణీ చేయనున్నారు. పెన్షన్లు ఇంటింటికీ సజావుగా అందేలా క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.