News March 30, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శనివారం 1,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.55,000లు, ప్రసాద విక్రయాలు ద్వారా రూ.7,32,080లు VIP దర్శనాల ద్వారా రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.1,19,100, కార్ పార్కింగ్ రూ.1,90,000, సువర్ణ పుష్పార్చన రూ.55,600, ప్రధాన బుకింగ్ రూ.90,450, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.20,42,139ల ఆదాయం వచ్చింది.

Similar News

News January 2, 2026

పార్క్‌‌లలో సీజనల్ ఫ్లవర్ ప్లాంట్‌లను నాటండి: బల్దియా కమిషనర్

image

పార్క్ లలో సీజనల్ ఫ్లవర్ ప్లాంట్లను నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఉద్యాన అధికారులను ఆదేశించారు. శుక్రవారం HNK పబ్లిక్ గార్డెన్, బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్క్, జయశంకర్ ఏకశిలా పార్క్‌లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. శీతాకాల సీజన్‌లో పుష్పించే పూల మొక్కలను నాటడం వల్ల పార్క్‌ల ఆవరణలు ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. సీహెచ్‌ఓ రమేష్, హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవళిక ఉన్నారు.

News January 2, 2026

బంగ్లాలో పర్యటించనున్న టీమ్ ఇండియా!

image

భారత జట్టు ఈ ఏడాది SEPలో బంగ్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పోస్ట్‌పోన్ అయిన పర్యటనను రీషెడ్యూల్ చేసినట్లు BCB క్రికెట్ ఆపరేషన్స్ ఇన్-ఛార్జ్ తెలిపినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. ‘ఆగస్టు 28న టీమ్ ఇండియా బంగ్లాదేశ్ చేరుకుంటుంది. SEP 1, 3, 6వ తేదీల్లో వన్డేలు, 9, 12, 13వ తేదీల్లో T20లు ఆడుతుంది’ అని తెలిపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య విభేదాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం నెలకొంది.

News January 2, 2026

ఇబ్రహీంపట్నం: రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్..

image

నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, రాములులను సిట్ అధికారులు శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించనున్నారు. గతంలో ఇబ్రహీంపట్నంలో జరిగిన నకిలీ మద్యం తయారీ కేసులో వీరిని సిట్ విచారించింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిని ఈ కేసులో పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరికి ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పించింది.