News March 30, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శనివారం 1,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.55,000లు, ప్రసాద విక్రయాలు ద్వారా రూ.7,32,080లు VIP దర్శనాల ద్వారా రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.1,19,100, కార్ పార్కింగ్ రూ.1,90,000, సువర్ణ పుష్పార్చన రూ.55,600, ప్రధాన బుకింగ్ రూ.90,450, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.20,42,139ల ఆదాయం వచ్చింది.

Similar News

News November 9, 2025

MBNR: అప్పు ఇవ్వడమే ప్రాణం తీసిందా..?

image

గద్వాల్ పట్టణం శేరెల్లి వీధికి చెందిన బలిజ లక్ష్మి మృతి కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్లా రామిరెడ్డి.. బలిజ లక్ష్మీ దగ్గర రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆమె అప్పు తీర్చమని అడిగే సరికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 2న హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు. నిందితుడి తండ్రి కల్లా నర్సింహరెడ్డి ఓ వ్యాపారం నడుపుతున్నాడు. పోలీసులు నిందితుడిని విచారిస్తునట్లు సమాచారం.

News November 9, 2025

RITES 40పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(<>RITES<<>>)40 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PWBDలు రూ.300 చెల్లించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News November 9, 2025

కాంగ్రెస్, BRS నేతలను నిలదీయండి: కిషన్ రెడ్డి

image

TG: కేసీఆర్ తరహాలోనే రేవంత్ కూడా మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క అమ్మాయికీ పెళ్లి సమయంలో తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు. ‘పెన్షన్లు పెంచలేదు, కొత్తవి ఇవ్వలేదు. దళితులకు ఆర్థిక సాయం చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని కాంగ్రెస్ నేతలను నిలదీయండి. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకివ్వలేదని బీఆర్ఎస్‌ను ప్రశ్నించండి’ అని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.