News March 10, 2025

యాదాద్రి శ్రీవారి రథోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మధుర ఘట్టమైన దివ్య విమాన రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతురావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రముఖ సినీ గాయకురాలు గీతా మాధురి భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు,ఛైర్మన్ నరసింహమూర్తి దంపతులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Similar News

News September 17, 2025

రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు

image

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక <<17731468>>ఫామ్‌లో<<>> వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్‌ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

News September 17, 2025

నంద్యాల: వేధింపులతో భార్య మృతి.. భర్తకు 7ఏళ్ల జైలు శిక్ష

image

భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ, ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన భర్త కనకం కృష్ణయ్యకు నంద్యాల కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లికి చెందిన రాజేశ్వరిని భర్త కనకం కృష్ణయ్య అదనపు కట్నం కోసం వేధించారు. మనస్తాపానికి గురైన ఆమె 2022లో విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

News September 17, 2025

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సంచిలో మహిళ డెడ్‌బాడీ

image

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఆమెను హత్య చేసి, సంచిలో కుక్కి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.