News September 22, 2025
యాదాద్రి: సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం

సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదైంది. హనుమాన్ ఐటీ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ పేరుతో మోసాలు చేస్తున్న వలిగొండ వాసి కల్లోజ్ ప్రేమ కుమార్పై సెక్షన్ 318(4), 316(2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగేందర్ గౌడ్ తెలిపారు. నిందితుడు నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగార్థులను మోసగిస్తున్నాడని బాధితులు ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News September 22, 2025
బాపట్ల: ఎస్పీ కార్యాలయానికి 65 అర్జీలు

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 65 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన వినతి పత్రాలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఆయన దగ్గరకు వెళ్లలేక ఇబ్బంది పడగా, ఆయనే వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
News September 22, 2025
అనంతపురం జిల్లాకు స్కోచ్ అవార్డు

అనంతపురం జిల్లాలో APMIP వివిధ పథకాల ద్వారా స్కోచ్ అవార్డును దక్కించుకుంది. కాగా అనంతపురం జిల్లా కలెక్టరేట్లో APMIP అధికారులు కలెక్టర్ ఆనంద్కు ఈ అవార్డును అందజేశారు. ఈ విజయం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ, APMIP PD రఘునాథ్రెడ్డి, ఉద్యాన శాఖాధికారి ఉమాదేవి పాల్గొన్నారు.
News September 22, 2025
ఆలూరు టీడీపీ నూతన ఇన్ఛార్జ్గా వైకుంఠం జ్యోతి

ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా వైకుంఠం జ్యోతి ఎన్నికైనట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ అధికారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వైకుంఠపు జ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలు తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, పల్లా శ్రీనివాస్కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.