News May 29, 2024
యానాం: గేదెను ఢీకొట్టి యువకుడి మృత్యువాత
యానాం ఒబిలిస్క్ టవర్ వద్ద మంగళవారం బైకుపై వేగంగా వెళుతున్న యువకుడు కర్రి నూకరాజు(21) గేదెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుడికి వెళ్లడం కోసం ఆటోలో బయల్దేరిన నూకరాజు కుటుంబం రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న తమ కుమారుడిని చూసి యానాం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా వైద్యులు వెంటనే కాకినాడకు తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 8, 2024
తూ.గో.జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపు
2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.100 కోట్ల నిధులను కేటాయించిందని టూరిజం అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాట్లకు, రాజమండ్రి నగరాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ దిశగా సంబంధిత అధికారులు పనులు ప్రారంభించారు.
News October 8, 2024
పిఠాపురంలో బాలికపై అత్యాచారం.. YCP ట్వీట్
పిఠాపురంలో జరిగిన బాలిక అత్యాచార ఘటనపై YCP ‘X’ వేదికగా స్పందించింది. ‘దళిత బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆటోలో తరలించేందుకు యత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకి రక్షణ కరవైంది. సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ?’అంటూ పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేసింది.
News October 8, 2024
తూ.గో: నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఎప్పటివరకంటే?
శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని జిల్లా మీదుగా మంగళవారం నుంచి ఈ నెల 12 వరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 8,10,12 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్, 9, 11 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.