News September 19, 2025
యారాడ కొండపై కనకదుర్గమ్మ.. ప్రత్యేక బోటు ఏర్పాటు

యారాడ కొండపై వేంచేసి ఉన్న శ్రీసాగర్ గిరి కనక దుర్గ అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈఉత్సవాలు జరగనున్నాయి. పోర్టు వెంకటేశ్వరస్వామి ఆలయ జెట్టీ నుంచి యారాడకు ప్రత్యేక బోట్ సౌకర్యం కల్పిస్తారు. గత ఏడాది టికెట్ ధర రూ.40గా ఉంది. గాజువాక, సింధియా మీదుగా రోడ్డు మార్గంలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు.
Similar News
News September 19, 2025
జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించిన మేయర్ బృందం

జోధ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్కు విశాఖ మేయర్ బృందం శుక్రవారం సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం, జోధ్ పూర్ మేయర్ వనిత సేధ్, కమిషనర్ సిధ్దార్థ పళనిచామితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి వనరులు, పచ్చదనం, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాలపై తెలుసుకున్నారు.
News September 19, 2025
దేవీ మండపాలకు సింగిల్ విండో అనుమతులు: విశాఖ సీపీ

విజయదశమి దేవీ మండపాల ఏర్పాటుకు https://durgautsav.net వెబ్ సైట్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో అనుమతి తీసుకోవాలని పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ తెలిపారు. జీవీఎంసీ, ఫైర్, విద్యుత్ విభాగాల సమన్వయంతో ఈ పోర్టల్ని ఏర్పాటు చేశామన్నారు. నిర్వాహకులు మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి, వివరాలు నమోదు చేయాలని కోరారు. మండపాలకు క్యూఆర్ కోడ్ ఇస్తారని, దాన్ని మండపాలు వద్ద ప్రదర్శించాలని తెలిపారు.
News September 19, 2025
మేయర్, కమిషనర్ ప్రజలతో ఆటలాడటం తగదు: ఎమ్మెల్యే వంశీకృష్ణ

జైలు రోడ్డు ఫుడ్ కోర్ట్లో దుకాణాలను స్థానిక MLA అయిన తనకు సమాచారం ఇవ్వకుండా <<17758951>>తొలగించడం<<>>పై వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ప్రజలతో ఆటలాడటం తగదని హెచ్చరించారు. ఫుడ్ కోర్ట్ వ్యాపారులు ఏళ్లుగా కష్టపడి దుకాణాలు నడుపుతున్నారని, ఒక్కసారిగా తొలగించడం అన్యాయం అని అన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్లో తీర్మానం పెట్టడాన్ని తప్పుపట్టారు.