News November 5, 2025
యాలాల్: ‘అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’

రోడ్డు ప్రమాదంలో మరణించిన యాలాల్ మండలానికి చెందిన పలు కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల చొప్పున ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అఖిల రెడ్డి కుటుంబానికి రూ.7లక్షల చెక్కును అందజేశారు.
Similar News
News April 14, 2026
మామిడి రాకతో బాట‘సింగారం’

మామిడి పండ్లు బాటసింగారం బాట పట్టాయి. సోమవారం సుమారు వెయ్యి టన్నుల పండ్లు దిగుమతి అయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరంలోని మిగతా మార్కెట్లకు మరో 300 టన్నుల మామిడి వచ్చినట్లు అంచనా. ఈ ఏడాది పంట ఆలస్యమైనా ఏప్రిల్ 3వ వారం నుంచే నగర మార్కెట్లకు మామిడి రికార్డు స్థాయిలో దిగుమతి అవుతోంది. హోల్సేల్ మార్కెట్లోనే సోమవారం మామిడి పండ్ల ధర కిలో రూ.70-120 పలికింది.
News April 14, 2026
తిరుపతి: రేపటి నుంచి పుస్తకాల పంపిణీ: ఆర్ఐవో

తిరుపతి జిల్లాలో ఇంటర్ క్లాసులు ప్రారంభమై 15 రోజులు గడిచినా రాధాకృష్ణన్ కిట్ పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఖాళీ చేతులతో క్లాసులకు వెళ్లిన విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన అధికారులు నూతన సిలబస్ పుస్తకాలను ఆర్ఐఓ కార్యాలయానికి చేరవేశారు. పంపిణీ ప్రక్రియ ప్రారంభమై, బుధవారం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పుస్తకాలు అందనున్నాయని ఆర్ఐఓ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News April 14, 2026
భయంకరమైన వ్యసనం.. సొంత రక్తాన్నే ఇంజెక్ట్ చేసుకుంటున్నారు

భోపాల్(MP)లో యువత భయంకర వ్యసనం బారిన పడుతున్నారు. మత్తు కోసం తమ రక్తాన్ని బయటకు తీసి మళ్లీ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. JAN నుంచి ఇలాంటి 5 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీన్ని ‘బ్లడ్ కిక్’ అంటున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, సెప్సిస్, హెపటైటిస్, నరాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం తదితర సమస్యలొస్తాయి. డిప్రెషన్, తనకు తానే గాయపర్చుకునే లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.


