News March 28, 2025

యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నద్ధం: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నద్ధం కావాలని అధికారులను కలెక్టర్ ఎం.మనూ చౌదరి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అధికారులతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

Similar News

News September 18, 2025

డీఎస్సీ అభ్యర్థులకు 134 బస్సులు: డీఈవో

image

రేపు అమరావతిలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని డీఈవో శామ్యూల్ తెలిపారు. వారిని అమరావతికి తీసుకెళ్లేందుకు 134 బస్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,590 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ కొలువులు సాధించారని అన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు బస్సులు బయలుదేరుతాయని, అభ్యర్థులు ఉ.7 గంటల్లోపు అక్కడికి చేరుకోవాలని తెలిపారు.

News September 18, 2025

మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

image

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్‌తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.

News September 18, 2025

SKLM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీకాకుళం ప్రభుత్వ డీఎల్టీసీ, ఐటీఐలో ప్రవేశాలకు 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ మోహనరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు మిగిలిన సీట్లకు నాలుగో విడత కౌన్సెలింగ్ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం, 28న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 29 న కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.