News December 31, 2025
‘యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, జులై 2026 నాటికి ఆర్.ఓ.బీ పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మార్చి 2026 నాటికి అండర్ పాస్ నిర్మాణ పనులను రైల్వే శాఖ పూర్తి చేయాలన్నారు. మార్చి 2026 నాటికి అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తవ్వాలన్నారు.
Similar News
News January 6, 2026
ఏపీలో వేగంగా ఎయిర్పోర్టులు!

ఏపీలో విమానాశ్రయాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, పుట్టపర్తిలో డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇటీవలే విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. రాజమండ్రిలో పనులు జరుగుతుండగా, భోగాపురంలో పూర్తి కావొచ్చింది. కొత్తగా కుప్పం, దొనకొండ (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు)లో ఎయిర్పోర్టులకు ప్లాన్ చేస్తున్నారు.
News January 6, 2026
PDPL: అనాథ పిల్లలందరూ చదువుకోవాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలందరూ విద్యకు దూరం కాకుండా చూడాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఐసీపీఎస్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన ఆయన, పిల్లల తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తులను వారికే దక్కేలా చూడాలన్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని, బాలసదనంలో మెరుగైన వసతులతో పాటు బెడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News January 6, 2026
ANU బీ ఫార్మసీ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరగనున్న బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం 7వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివ ప్రసాదరావు విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 22 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 23వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్ సైట్ www.Nagarjuna University.ac.in పొందవచ్చన్నారు.


