News December 31, 2025

‘యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి’

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, జులై 2026 నాటికి ఆర్.ఓ.బీ పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మార్చి 2026 నాటికి అండర్ పాస్ నిర్మాణ పనులను రైల్వే శాఖ పూర్తి చేయాలన్నారు. మార్చి 2026 నాటికి అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తవ్వాలన్నారు.

Similar News

News January 9, 2026

జాతీయస్థాయికి ఎంపికైన జనగాం కేజీబీవీ విద్యార్థిని

image

జనగాం జిల్లా కేజీబీవీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జి.అక్షిత రూపొందించిన అడ్జస్టబుల్ బైక్ స్టాండ్ అనే వినూత్న ఆవిష్కరణకు గాను జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ (NLEPC) కు ఎంపికైంది. ఈ సందర్భంగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్‌తో పాటు ఉపాధ్యాయ బృందం అక్షితను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News January 9, 2026

BJP కొత్త ఆయుధంగా సెన్సార్ బోర్డు: స్టాలిన్

image

సెన్సార్ బోర్డుపై తమిళనాడు CM స్టాలిన్ ఫైర్ అయ్యారు. CBI, ED, IT శాఖ మాదిరే ఇప్పుడు సెన్సార్ బోర్డు BJP కొత్త ఆయుధంగా మారిందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ విషయంలోనే ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. మొత్తం 25కట్స్‌ సూచిస్తూ U/A సర్టిఫికెట్‌ను CBFC జారీ చేసింది. 1965 యాంటీ హిందీ ఆందోళన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి DMK సపోర్ట్ ఉంది.

News January 9, 2026

KNR: ‘స్కూల్ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం’

image

KNRరూరల్(M) దుర్శేడ్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో కిసాన్ నగర్‌కు చెందిన బొడ్డు శశికుమార్(28) అక్కడికక్కడే మృతిచెందినట్లు రూరల్ CI నిరంజన్ రెడ్డి తెలిపారు. అతివేగంగా వచ్చిన <<18811180>>ఓ<<>> స్కూల్ బస్సు, శశికుమార్ ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టి తలపైనుంచి వెళ్లడంతో ఈ ఘోరం జరిగిందని పేర్కొన్నారు. నిందితుడైన డ్రైవర్ అనిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.