News September 8, 2024
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పనులు పునరుద్ధరణ – గొట్టిపాటి

వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం పేర్కొన్నారు. ఇప్పటికీ వరద ప్రాంతంలో 2.70 లక్షల కనెక్షన్ లో పునరుద్ధరించామన్నారు. మరో ఏడు వేల కనెక్షన్ ను పెండింగ్లో ఉన్నాయన్నారు. విద్యుత్తు పునరుద్ధరణ చేయు ఆటంకంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంగా సిబ్బంది పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
ప్రకాశం: ‘సంప్రదాయ క్రీడలను నిర్వహించాలి’

కోడి పందేలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయ క్రీడలను నిర్వహించాలన్నారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే 112 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే 9121102266 వాట్సాప్ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News January 10, 2026
ప్రకాశం: సంక్రాంతికి విద్యుత్ శాఖ సూచనలు

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలను ఎగరేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. గాలిపటాలను ఎగరేసే సమయంలో సమీపంలో ఉన్న కరెంటు తీగలు, ట్రాన్స్ఫార్మర్లను గమనించాలన్నారు. గాలిపటాలు విద్యుత్ తీగలకు చిక్కుకున్న సమయంలో వాటిని తీయరాదన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే 1912 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News January 10, 2026
ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి

ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి. సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం. ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి. ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీకి కేటాయించారు.


