News November 13, 2024

యురేనియం తవ్వకాలపై వైసీపీ ఎమ్మెల్యే కట్టుకథ: పత్తికొండ ఎమ్మెల్యే

image

దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు అన్నది వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి కల్పించిన కట్టు కథ అని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం అమరావతిలోని శాసనసభ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ యురేనియం తవ్వకాలపై వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. యురేనియం తవ్వకాలు జరిగే ప్రసక్తి లేదని తేల్చిచెప్పేశారు.

Similar News

News July 5, 2025

చెరువులలో ఆక్రమణలు తొలగించండి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు చెరువుల స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, గుడిసెలు వంటి తాత్కాలిక ఆక్రమణలను తొలగించాలని అధికారులకు ఇన్‌ఛార్జి కలెక్టర్ డా.బి.నవ్య ఆదేశించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటి వనరుల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

News July 4, 2025

అల్లూరి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేద్దాం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సూచించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా యువజన సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెట్కూరు సీఈవో వేణుగోపాల్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

News May 7, 2025

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కర్నూలు కలెక్టర్

image

విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆకాంక్షించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువును అభ్యసించినప్పుడే మంచి స్థాయిలో నిలుస్తారని అన్నారు.