News February 1, 2025

యువతీ యువకులకు ఉచిత శిక్షణ  

image

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పుర్ గ్రామంలోని స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు. బేసిక్ కంప్యూటర్స్, సోలార్ సిస్టం ఇన్‌స్టాలేషన్, సర్వీస్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, ఎలక్ట్రీషియన్‌పై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తుచేసుకోవాలన్నారు.

Similar News

News December 21, 2025

ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు

image

AP: ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 7 టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc, MSc(హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్ & ఫ్యామిలీ స్టడీస్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు(M), మహిళలకు 45ఏళ్లు. అర్హతగల వారు ఈనెల 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వెబ్‌సైట్: https://angrau.ac.in

News December 21, 2025

‘కెరీర్ మినిమలిజం’.. Gen Zలో కొత్త ట్రెండ్.. ఏంటిది?

image

ఆఫీసుల్లో రాత్రి పగలు కష్టపడే హజిల్ కల్చర్‌కు Gen Z చెక్ పెడుతోంది. దీన్నే కెరీర్ మినిమలిజం అంటున్నారు. అంటే పని పట్ల బాధ్యత లేకపోవడం కాదు. ప్రమోషన్లు, హోదాల వెంట పడకుండా ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం. మేనేజర్ పోస్టుల్లో ఉండే స్ట్రెస్ కంటే మెంటల్ హెల్త్, పర్సనల్ లైఫ్ ముఖ్యమని వీరు భావిస్తున్నారు. 72% మంది టీమ్ మేనేజ్‌మెంట్ కంటే స్కిల్స్ పెంచుకోవడానికే ఇష్టపడుతున్నారు.

News December 21, 2025

VZM: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున

image

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల లక్ష్మివరప్రసాద్‌ని నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. కిమిడి నాగార్జున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండంగా.. ప్రసాదుల లక్ష్మివరప్రసాద్ యాదవ సంఘం కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.