News October 9, 2025
యూరియా కొరత నివారించేందుకు చర్యలు

రబీ వరి సాగులో యూరియా కొరతను నివారించేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఎకరాకు 3 బస్తాలకే పరిమితం చేసి, మొత్తం 94,383 టన్నుల అవసరాన్ని లెక్కగట్టింది. జిల్లాలో ప్రస్తుతం 6వేల టన్నుల నిల్వ ఉండగా, ఈ నెలాఖరుకు మరో 4వేల టన్నులు రానున్నాయి. రైతులు వ్యవసాయశాఖ ఇచ్చే ప్రత్యేక కార్డు ద్వారా మాత్రమే యూరియా పొందాలి. కార్డులో రైతు వివరాలు, భూమి విస్తీర్ణం, పంట వివరాలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారిణి అన్నారు.
Similar News
News October 9, 2025
నెల్లూరు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వ్యాపారం!

నెల్లూరు జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారం ఆగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం ఉన్నప్పటికీ పరిస్థితి యథాతథంగా ఉంది. యువత, విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా మారి గంజాయి వ్యాపారం విస్తరిస్తోంది. విశాఖ నుంచి దిగుమతి చేసే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి కళాశాలలు, బస్టాండ్లు, థియేటర్లు, కేఫేల్లో విక్రయిస్తున్నారు. మొదట ఉచితంగా ఇచ్చి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
News October 9, 2025
నెల్లూరు: నగదు ఇవ్వలేదని ఇద్దరిని చంపేశారు!

నెల్లూరులో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. నెల్లూరుకు చెందిన పాత నేరస్తులు సాయిశంకర్, మనోజ్ మద్యం తాగి జాఫర్ సాహెబ్ కాలువ వద్దకు వెళ్లారు. అటుగా వస్తున్న YSR కడప జిల్లాకు చెందిన శివను అడ్డుకుని నగదు అడగగా లేవని చెప్పడంతో దాడి చేసి చంపారు. పెన్నా సమీపంలో ఉంటున్న పోలయ్య అటుగా వెళ్తుండగా అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేయగా లేవని చెప్పడంతో హత్యచేశారు. గంటల వ్యవధిలోనే నిందితులును పోలీసులు అరెస్ట్ చేశారు.
News October 9, 2025
10న వెంకటాచలం రానున్న CM..

CM చంద్రబాబు ఈ నెల 10న వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి బిట్ 2 గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం, నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ పరిసరాలను వారు ముమ్మరంగా తనిఖీ చేశారు.