News August 27, 2025

యూరియా వస్తుంది, రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి కొలుసు

image

యూరియా సరఫరా జరుగుతుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎరువులు, ముఖ్యంగా యూరియా లభ్యతపై సీఎం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. రైతులకు ఎటువంటి కొరత లేకుండా ఎరువులు సరఫరా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Similar News

News August 27, 2025

ALLERT.. 3 రోజులు జాగ్రత్తగా ఉండండి: సిద్దిపేట CP

image

మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ అనురాధ ప్రజలకు సూచించారు. ప్రజలు పోలీసు అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలని కోరారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజర్లు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో ఇబ్బంది ఉంటే డయల్ 100 లేదా 87126 67100కు కాల్ చేయాలని సూచించారు.

News August 27, 2025

JGTL: చెరువులో లభ్యమైన గణనాథుడికి నేటికీ పూజలు!

image

JGTL జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో కాకతీయుల కాలంలో వెలికి తీసిన గణపతి రాతి విగ్రహం ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. చెరువు తవ్వే క్రమంలో లభించిన ఈ గణనాథుడు గ్రామంలోని చెరువు సమీపంలో కలువుదీరాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విరామంగా పూజలు స్వీకరిస్తున్నాడు. కాగా, గ్రామస్థులు ఆలయం నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహంతో పాటు అనేక విగ్రహాలు బయటపడ్డాయని పలువురు పెద్దమనుషులు తెలిపారు.

News August 27, 2025

జనగామ: మాకేవి పూజలు..!

image

జిల్లాలోని రఘునాథపల్లి మండలంలో ఆధ్యాత్మిక గ్రామమైన నిడిగొండలో పదుల సంఖ్యలో గణపతి(వినాయకులు) మూర్తులు కొలువై ఉన్నారు. రాష్ట్రకూటుల కాలం నుంచి కాకతీయుల కాలం వరకు ఈ విగ్రహాలు పూజలు అందుకున్నాయి. కాలక్రమేణా ఈ విగ్రహాలు కాలగర్భంలో కలిసిపోవడంతో పూజలకు నోచుకోవడం లేదు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న వేళ ఈ విగ్రహాలకు మాత్రం పూజలు కరవయ్యాయి.