News September 19, 2025

యూ-డైస్ అప్ డేషన్ పూర్తి చేయాలి: డీఐఈవో

image

వరంగల్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులందరి యూడైస్, ఆధార్, తదితర అన్ని వివరాలు నవీకరించుకోవాలని DIEO డా.శ్రీధర్ సుమన్ అన్నారు. నర్సంపేట మైనారిటీ బాలికల కళాశాలలో అడ్మీషన్, అపార్, తదితర రికార్డులను DIEO పరిశీలించారు. జిల్లాలోని 67 కళాశాలల్లో అడ్మీషన్ పొందిన విద్యార్థుల అన్ని వివరాలను నవీకరించడానికి సంబంధిత కళాశాలల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని DIEO అన్నారు.

Similar News

News September 20, 2025

వరంగల్ కలెక్టరేట్లో భూ నిర్వాసితులతో కలెక్టర్ ఆర్బిట్రేషన్

image

కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే-163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన నెక్కొండ, పర్వతగిరి మండలాల రైతులతో ఆర్బిట్రేషన్ సమావేశం జరిగింది. భూస్వాములకు అవార్డ్ పాస్ చేసే దిశగా చర్చలు జరిగాయి. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవోలు, తహశీల్దార్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

News September 19, 2025

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించండి: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం 26 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రామాల్లో గుడుంబా గంజాయి నిర్మూలనకు ప్రతినెలా సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించాలన్నారు.

News September 18, 2025

ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. 2025-26లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 260 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా నిలువ చేయాలన్నారు.