News April 7, 2025

రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణికి 56 ఫిర్యాదులు

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. 56 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఫిర్యాదులని డీఆర్వో సంగీత స్వీకరించి తాగు చర్యల కోసం సంబంధించిన అధికారులను ఆదేశించారు. రెవెన్యూ- 21, ఇతర శాఖలకు – 35 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని పలు శాఖల అధికారులకు డీఆర్ఓ సంగీత సూచనలు ఇచ్చారు.

Similar News

News July 7, 2025

టేస్టీ ఫుడ్: వరల్డ్‌లో హైదరాబాద్‌కు 50వ స్థానం

image

రుచికరమైన వంటకాల్లో బెస్ట్ సిటీ మన హైదరాబాద్ అని మరోసారి నిరూపితమైంది. టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ ఫుడ్‌ లభించే నగరాల్లో HYDకు 50వ స్థానం దక్కింది. HYD బిర్యానీ, హలీమ్, ఇరానీ ఛాయ్, తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ, మొఘల్, టర్కిష్ రుచులు సిటీలో ఏ మూలకు వెళ్లిన లభిస్తాయి. అందరికీ అందుబాటులోనే ధరలు ఉండటం విశేషం. మరి సిటీలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏది? కామెంట్ చేయండి.

News July 7, 2025

HYD: యుక్త వయసులో మెదడుపై ప్రభావం!

image

యుక్త వయసులోనే యువత మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఓ వైపు డ్రగ్స్, మద్యం మత్తు, మరోవైపు సైబర్ మోసం, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకోవడంతో ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో తల తిరగడం, ఒళ్లు వణికే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి లక్షణాలు కలిగిన 18 మందికి పైగా ఈ నెలలో ఎర్రగడ్డ, ఉస్మానియా వైద్యులను సంప్రదించడం ఆందోళనకరం.

News July 6, 2025

HYD: డ్రంక్‌ అండ్ డ్రైవ్.. 105‌ మందిపై చర్యలు

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో పట్టుబడ్డ 105 మందిని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రూ.2.39 లక్షల జరిమానా విధించబడింది. కొందరికి జైలు శిక్షలు కూడా విధించారు. ఈ చర్యలు ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన పెంపొందించేందుకు చేపట్టినవని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ACP మోహన్ కుమార్ తెలిపారు.