News March 18, 2025

రంగారెడ్డి: 2nd ఇయర్ పరీక్షకు 2,399 మంది డుమ్మా

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో 73,192 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,793 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,399 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.

Similar News

News March 19, 2025

దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం.. నాగమణి దొరికిందిలా! (UPDATE)

image

దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నాగమణిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితురాలిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘హలో నాగమణి’ అంటూ వాట్సాప్‌లో విటుల వలే మెసేజ్ చేయడంతో ఆమె దిల్‌సుఖ్‌నగర్‌కు అమ్మాయిని తీసుకొచ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట వాసి నాగమణి సినిమా అవకాశం అంటూ యువతులను వ్యభిచారంలోకి దింపుతున్నట్లు తేల్చారు.

News March 19, 2025

HYD: బడ్జెట్‌లో ట్యాంక్‌బండ్‌ను కాపాడండి!

image

రాష్ట్ర బడ్జెట్‌లో హుస్సేన్‌సాగర్‌కు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. దుర్గంధభరితమైన నీటితో టూరిస్టులు ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. పొల్యూషన్‌ పెరిగి నీరు గ్రీన్ కలర్‌‌లోకి మారుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ సుందరీకరణ బాగున్నా మురికి కూపంపై ఎవరూ దృష్టి పెట్టడంలేదు. ఇకనైనా నీటి ప్రక్షాళనకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బడ్జెట్‌లో HYDకు ఇంకెం కావాలి..మీ కామెంట్?

News March 19, 2025

హైదరాబాద్‌‌లో ముంచుకొస్తున్న ముప్పు!

image

HYD‌కు ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. ORR వరకు 948 చ.కిమీ మేర ఏకంగా 921 చ. కిమీ మేర భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు జలమండలి నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజు దాదాపు 11 వేల ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. IT కారిడార్, కూకట్‌పల్లి, మాదాపూర్‌, శేరిలింగంపల్లి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది.

error: Content is protected !!