News April 14, 2025

రంపచోడవరంలో నేడు గ్రీవెన్స్ రద్దు

image

రంపచోడవరంలో సోమవారం నిర్వహించవలసిన గ్రీవెన్స్‌ని రద్దు చేశామని ITDA. PO. సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. దీంతో గ్రీవెన్స్ రద్దు అయ్యిందని తెలిపారు. రంపచోడవరం డివిజన్‌లో ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు.

Similar News

News September 16, 2025

సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

image

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

News September 16, 2025

పెద్దపల్లి: ‘జర్నలిస్టు సాంబశివరావుపై కేసులు ఎత్తివేయాలి’

image

టీ న్యూస్ ఖమ్మం ప్రతినిధి సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళనకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. జర్నలిస్టులపై కేసులు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఉల్లంఘన అని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ ఖండించారు.

News September 16, 2025

HNK, BHPLలో నిలిచిపోనున్న రైల్వే రిజర్వేషన్ సేవలు

image

హనుమకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్, భూపాలపల్లి పోస్ట్ ఆఫీస్‌లో రైల్వే రిజర్వేషన్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రతిరోజు కనీసం 10 టికెట్ల బుకింగ్ జరగడం లేదనే కారణంతో ఈ సేవలను నిలిపివేస్తూ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీనియర్ సిటిజన్స్ సహా నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కావ్య తక్షణమే ఈ సేవలను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.