News February 26, 2026
రంపచోడవరం డీఎస్పీ బదిలీ

రంపచోడవరం డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ బదిలీ అయ్యారు. 25మంది డీఎస్పీలను ప్రాధాన్యత లేని పోస్ట్లలో వేయాలని హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు వారిని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ పేరు కూడా ఉంది. కాగా ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది పేర్కొనలేదు.
Similar News
News March 2, 2026
ఒక్క ఇన్నింగ్స్తో రోహిత్, కోహ్లీ రికార్డులు బ్రేక్!

విండీస్తో మ్యాచ్లో సంజూ శాంసన్ రికార్డులు బద్దలు కొట్టారు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో అత్యధిక బౌండరీలు (16) బాదిన భారత ప్లేయర్గా రోహిత్ శర్మ (15) రికార్డ్ బ్రేక్ చేశారు. అలాగే ఛేజింగ్లో అత్యధిక రన్స్ (97*) స్కోర్ చేసి విరాట్ కోహ్లీ (82*) రికార్డ్ అధిగమించారు. కోహ్లీ 2016లో AUSపై, 2022లో PAKపై ఈ రన్స్ చేశారు. T20Iల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (3) దక్కిన ఇండియన్ కీపర్ కూడా సంజూనే.
News March 2, 2026
సౌదీ సైలెంట్గా పావులు కదిపిందా?

ఇరాన్పై US దాడుల వెనుక సౌదీ అరేబియా ప్రిన్స్ సల్మాన్ హస్తం ఉందని వాషింగ్టన్పోస్ట్ కథనం వెల్లడించింది. ఇరాన్కు బహిరంగంగా మద్దతు తెలిపినా, దాడి చేయమని సల్మానే ట్రంప్ను ప్రోత్సహించి ఒప్పించినట్లు పేర్కొంది. షియా సిద్ధాంతాలు, ఇరాన్ ప్రభావం వ్యాపించకూడదని సౌదీ ప్లాన్ చేయగా.. తమ సరిహద్దుల్లో ఇరాన్ పోషిస్తున్న మిలిటెంట్ల బెడద తగ్గించుకోవడం సులువు అవుతుందని ఇజ్రాయెల్ ఇందుకు సహకరించినట్లు తెలుస్తోంది.
News March 2, 2026
చైనా ఆయుధాలు మరోసారి తుస్సు

చైనా డిజైన్ చేసిన ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్స్ మరోసారి ఫెయిలయ్యాయి. వీటిని నమ్ముకునే US, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ ఎదుర్కొనేందుకు ప్రయత్నించి దెబ్బతింది. ఆ దేశం ఇచ్చిన HQ-9B డిఫెన్స్ సిస్టమ్ శత్రువుల మిసైళ్లను ఎదుర్కోలేకపోయింది. కొన్నింటిని అసలు గుర్తించలేకపోయింది. దీంతో ఇరాన్ భారీగా నష్టపోయింది. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మడురో, ఆపరేషన్ సిందూర్ టైమ్లో పాక్ సైతం చైనాను నమ్ముకొని దెబ్బతిన్నాయి.


