News November 18, 2025
రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రికి వినతి

రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రి సత్యకుమార్ ను కోరామని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, స్వప్న కుమారి తెలిపారు. విజయవాడలో సోమవారం కలిసి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రంపచోడవరం, పోలవరం కలపడం వలన షెడ్యూల్ ఏరియా అంతా ఒకే జిల్లాలో.. గిరిజనుల హక్కులు, చట్టాలకు భంగం కలుగకుండా ఉంటుందని చెప్పారు.
Similar News
News November 18, 2025
మంచిర్యాలలో అమానవీయ ఘటన

మంచిర్యాలలో అమానవీయ ఘటన జరిగింది. సాయి హనుమాన్ నగర్కు చెందిన వృద్ధురాలు నాడెం రాజు ఆదివారం రాత్రి మృతి చెందింది. కుమార్తె లలిత పాత ఇంటిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పాత మంచిర్యాలలోని ఇంటికి తరలించింది. ఈ విషయం సీఐ ప్రమోద్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన జోక్యంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చారు. తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పంచుకునేందుకు అంగీకారం కుదరడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
News November 18, 2025
మంచిర్యాలలో అమానవీయ ఘటన

మంచిర్యాలలో అమానవీయ ఘటన జరిగింది. సాయి హనుమాన్ నగర్కు చెందిన వృద్ధురాలు నాడెం రాజు ఆదివారం రాత్రి మృతి చెందింది. కుమార్తె లలిత పాత ఇంటిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పాత మంచిర్యాలలోని ఇంటికి తరలించింది. ఈ విషయం సీఐ ప్రమోద్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన జోక్యంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చారు. తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పంచుకునేందుకు అంగీకారం కుదరడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
News November 18, 2025
కడుపులోనే కవలలు, భార్య మృతి.. భర్త ఆత్మహత్య

AP: అన్నమయ్య జిల్లాకు చెందిన విజయ్-శ్రావ్య దంపతుల కథ విషాదాంతమైంది. 8 ఏళ్ల క్రితం పెళ్లి కాగా HYDలో అద్దెకు ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో IVF ద్వారా శ్రావ్య గర్భం దాల్చింది. 8 నెలల గర్భంతో ఉన్న శ్రావ్య కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా గర్భంలోని కవలలు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె కూడా చనిపోయింది. ఈ విషాదాన్ని తట్టుకోలేని విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.


