News March 31, 2025

రణస్థలం: అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

image

రణస్థలంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న పిన్నింటి అప్పలసూరి ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పరిశ్రమలో ఉన్న వాష్ రూమ్‌లో ఉరివేసుకొని మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. మృతునిది నరసన్నపేట మండలం లుకలాం గ్రామం అని తెలిసింది. అయితే అప్పలసూరి మృతి పట్ల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

Similar News

News February 18, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

★శ్రీముఖలింగం: చక్రతీర్థస్నానాలకు పోటెత్తిన భక్తులు
★నందిగాం: వృక్షం వేర్లు ఆలయానికి రక్షణ
★వంశధార ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించాలి: ఎమ్మెల్యే బగ్గు
★పలాస: చైన్ స్నాచింగ్ చేస్తుండగా పట్టేశారు
★ఆదిత్యుని సన్నిధిలో ఐఆర్ఎస్ ప్రిన్సిపల్ కమీషనర్
★శ్రీకాకుళం: ఈనెల 20న జాబ్ మేళా
★ఎల్.ఎన్ పేట: నదీ తీరాన ఆకట్టుకున్న ఈశ్వరుని సైకత శిల్పాలు
★ఎచ్చెర్ల: తగ్గిన టమాట ధర

News February 18, 2026

ఎల్.ఎన్.పేట: ‘నదీతీరాన ఆకట్టుకున్న ఈశ్వరుడి సైకత శిల్పాలు’

image

ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం చక్ర తీర్థ స్నానాలు సందర్భంగా శివుడు, శివలింగం కళాకృతులను తరణి ప్రసాద్ మిశ్రా నిర్మించారు. వీటికి భక్తులు పసుపు,కుంకుమలో పూజలు చేశారు.

News February 18, 2026

రీసర్వే వేగవంతం చేయండి: శ్రీకాకుళం కలెక్టర్

image

రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని, రికార్డుల్లో వ్యత్యాసాలను సరిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. 4వ దశ రీసర్వే 167 గ్రామాల్లో జరుగుతోందని,24 గ్రామాల్లో పూర్తయిందన్నారు. weblandలో ఇతరుల పేరిట ఉన్న భూముల వివరాలు పరిశీలిస్తే 29,953 సర్వే నంబర్లలో తప్పులున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు.