News October 9, 2025

రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: డిప్యూటీ స్పీకర్

image

పద్మవిభూషణ్ రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం రతన్ వర్ధంతి సందర్భంగా పెద అమిరంలోని ఆయన విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. పారిశ్రామిక రంగానికే కాక, ప్రపంచానికే ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

Similar News

News October 9, 2025

ఏలూరు: యువతికి వేధింపులు.. యువకుడి అరెస్టు

image

ఏలూరు వన్‌టౌన్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న యువతిని ప్రేమించాలంటూ వేధిస్తున్న సాయి అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కళాశాలకు వచ్చి వెళ్లే సమయంలో సాయి వెంటపడటంతో, బాధితురాలు శక్తి టీమ్‌కు ఫిర్యాదు చేసింది. అతడిని పట్టుకున్న శక్తి టీం, వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించింది. సాయిపై కేసు నమోదు చేశామని, సహకరించినందుకు యువతి కృతజ్ఞతలు తెలిపిందని సీఐ సుబ్బారావు గురువారం వెల్లడించారు.

News October 9, 2025

లఘు చిత్రాల పోటీకి ఈనెల 15 వరకు గడువు: కలెక్టర్

image

ఆంధ్ర యువ సంకల్ప్ -25- అంబాసిడర్” డిజిటల్ మారథాన్ కార్యక్రమంలో ”యువ సంకల్ప్” లఘు చిత్రాల పోటీకి గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈనెల 15 వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే సెట్వెల్ కార్యాలయం 7075230609 నంబర్‌కు సంప్రదించాలన్నారు. ముందుగా www.andhrayuvasankalp.com వెబ్ సైట్‌లో రిజిస్టర్ కావాలన్నారు.

News October 8, 2025

మత్స్య సంపద యోజన పథకానికి దరఖాస్తులు: కలెక్టర్

image

పీఎం మత్స్య సంపద యోజన పథకానికి విరివిగా దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్లో పీఎంఎంఎస్‌వై పథకం అమలపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పీఎం మత్స్య సంపద యోజన పథకం ద్వారా వివిధ సబ్సిడీ రుణాలను పొంది లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 50% బ్యాంకు రుణం, 40% సబ్సిడీ, 10% లబ్ధిదారుడు వాటాగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.