News January 29, 2025

రథసప్తమి ఏర్పాట్లపై TTD అదనపు ఈవో సమీక్ష

image

తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమీక్ష  నిర్వహించారు. టీటీడీ వివిధ విభాగ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా జన రద్దీని అంచనాలు వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో పాల్గొన్నారు.

Similar News

News November 7, 2025

వరంగల్: రూ.1.27 కోట్ల ప్యాకేజీతో JOB

image

వరంగల్ ఎన్ఐటీలో శుక్రవారం జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న నారాయణ త్యాగి అనే విద్యార్థి క్యాంపస్ సెలక్షన్లలో రూ.1.27 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. భారీ ప్యాకేజీతో ఎంపికైన నారాయణను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుభుతి, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ ఘనతతో ఎన్‌ఐటీ వరంగల్‌ను దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలబెట్టామని తెలిపారు.

News November 7, 2025

HYD మెట్రో ఛార్జీల పెంపు.. అదంతా FAKE

image

HYD మెట్రో రైలు ఛార్జీల పెంపుపై వస్తున్న వార్తలపై IPR అసిస్టెంట్ డైరెక్టర్ జాకబ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి ఛార్జీల సవరణ లేదని తెలిపారు. మెట్రో రైల్వేస్ (O&M) చట్టం- 2002 ప్రకారం, ఛార్జీలు నిర్ణయించే బాధ్యత మెట్రో రైల్వే అడ్మినిస్ట్రేషన్ (MRA)కి ఉంటుంది. ఈ నిర్ణయం FFC సిఫార్సుల ఆధారంగా మాత్రమే తీసుకుంటారని పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న ఛార్జీల పెంపు వార్తలు నిరాధారమన్నారు.

News November 7, 2025

ASF: ‘సిబ్బంది శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

image

ASF డివిజన్‌లోని సిబ్బందికి అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ రైతు వేదికలో మహిళా శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ASF డివిజన్ లోని ఐసిడిఎస్, వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ఎఫ్‌పీ రీ-ఓరియంటేషన్ శిక్షణ తరగతులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాంలతో కలిసి హాజరయ్యారు.