News January 18, 2026

రథ సప్తమికి ఆర్ట్స్ కాలేజీ‌లో డ్రోన్ షో

image

అరసవిల్లి సూర్యనారాయణ దేవస్థానంలో రథసప్తమి వేడుకలు పురస్కరించుకుని శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 23వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో జరుగుతుందన్నారు.

Similar News

News February 9, 2026

శ్రీకాకుళం: ఎస్పీ పీజీఆర్ఎస్‌లో 53 వినతులు

image

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 53 వినతులు అందినట్లు అదనపు ఎస్పీ కె.వి. రమణ తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అందిన వినతులపై తక్షణమే స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News February 9, 2026

SKLM: వరుస దొంగతనాలు.. ప్రజల హడల్

image

మందసలోని బాలిగాం గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కిల్లి శారదమ్మ ఇంట్లో తులమున్నర బంగారం, వల్లభ భూదేవి ఇంట్లో ఆరు తులాల వెండి పట్టుకొని పోయారు. దాంతో పాటు మార్పు భుజంగరావు ఇంట్లో బీరువాలను తెరిచి చిందర వందరగా పడేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ వివరాలు సేకరించారు.

News February 9, 2026

శ్రీకాకుళం: టెన్త్ విద్యార్థులకు గమనిక

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఎగ్జామ్స్‌లో ఓ పరీక్ష తేదీని మార్చినట్లు డీఈవో రవి కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిషు పరీక్ష, ఆ రోజు రంజాన్ కావడంతో మరుసటి రోజు 21న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మార్పును టీచర్లు, విద్యార్థులు గమనించాలన్నారు.