News June 29, 2024
రమేష్ రాథోడ్ మృతిపై ఏపీ సీఎం సంతాపం
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో రమేష్ రాథోడ్ టిడిపి నుండి ఖానాపూర్ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ ఛైర్మన్గా పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివాసి, గిరిజన గ్రామాల అభివృద్ధికి ఆయన కృషి చేశారని, రమేష్ రాథోడ్ మృతి తనను ఎంతో బాధించిందని ఆయన వెల్లడించారు.
Similar News
News September 30, 2024
విద్యార్థులు కష్టపడి పోటీపరీక్షల్లో రాణించాలి: గోడం నగేశ్
హైదరాబాద్లోని కొమరం భీం స్టడీ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, డా.సిడాం మధుకర్, మేస్రం నాగోరావు, తదితరులు పాల్గొన్నారు.
News September 29, 2024
ఆదిలాబాద్: DEECET విద్యార్థులకు GOOD NEWS
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో TG DEECET-2024లో ర్యాంక్ సాధించి ఆగస్టు నెలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరుకాని అభ్యర్థులకు మరొకసారి అవకాశం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలో అక్టోబర్ 1న ఉ.10 నుంచి సా.5 గంటల వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News September 29, 2024
ASF: రేపు జోనల్ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
ఆసిఫాబాద్లోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో సోమవారం SGFజోనల్ స్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు DEOయాదయ్య, SGF జిల్లా సెక్రటరీ సాంబశివరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంట్రీ ఫామ్లతో ఉదయం 9గంటలకు హాజరుకావాలన్నారు. వివరాలకు TW క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్ అరవింద్ను సంప్రదించాలని సూచించారు.