News February 20, 2025
రవీంద్ర భారతిలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

రవీంద్ర భారతిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగ్ బండారి హోమంలో పాల్గొన్నారు. గిరిజన జాతిని చైతన్య పరిచేందుకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, పూజనీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 జయంత్యుత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News September 18, 2025
BREAKING.. HYDలో భారీ ట్రాఫిక్.. 5KMల వరకు నరకం..!

HYDలో కొద్ది గంటలుగా కురుస్తోన్న వర్షంతో నగరంలో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో అమీర్పేట్- బేగంపేట్, సికింద్రాబాద్, సోమాజీగూడ- బేగంపేట్, సికింద్రాబాద్కు వెళ్లే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో దాదాపు 5 KMల వరకు ట్రాఫిక్ స్తంభించినట్లు తెలుస్తోంది. కాగా, ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులెవరూ ఇంకా రంగంలోకి దిగకపోవడం గమనార్హం.
News September 18, 2025
జూబ్లీ అభయం: ఒకరికి CM.. మరొకరికి పీసీసీ..!

జూబ్లీహిల్స్ టికెట్ కేటాయింపులో కొత్త రాజకీయం బయటకు వస్తుందని గాంధీభవన్లో చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ అనూహ్యంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం వెనక పీసీసీ వర్గం ఉన్నట్లు అంచనా. అంజన్కు టికెట్ ఇప్పించేందుకు పీసీసీ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడి నుంచి నవీన్ కుమార్ లేదా దానం నాగేందర్కు మద్దతుగా ఉన్నట్లు టాక్.
News September 18, 2025
ఈనెల 22 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ పరీక్షలు

జిల్లాలో టాస్క్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, TG ఓపెన్ స్కూలింగ్ సొసైటీ (TOSS) SSC & ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు.