News March 15, 2025
రాంబిల్లి: అలలకు వ్యక్తి గల్లంతు

రాంబిల్లి మండలం కడపాలెంకి చెందిన మత్స్యకారుడు మెరుగు జగన్(20) చేపలు పడుతుండగా సముద్రపు అలలకు బోటు తిరగబడి గల్లంతయ్యాడు. సీఐ నర్సింగరావు కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం జెడ్.చింతవ సమీపంలో ఐదుగురితో కలిసి చేపలు పడుతుండగా బోటు తిరగబడి జగన్ గల్లంతయ్యాడు. మిగిలిన ఐదుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. కుమారుడు గల్లంతయినట్లు అతని తండ్రి అచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News April 14, 2026
3 నెలలు తట్టుకోగలరా?.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

హార్ముజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడంపై ఇరాన్ దీటుగా స్పందించింది. తమకు ఇబ్బందేం లేదని, 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. ‘ఇరాన్ను దిగ్బంధిస్తానని ఆయన(ట్రంప్) బెదిరించాడు. 3 నెలలపాటు అమ్ముకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉంది. మీరు, మీ మిత్రదేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకముందా?’ అని బల్గేరియాలోని ఇరాన్ ఎంబసీ ప్రశ్నించింది.
News April 14, 2026
IPL: CSKతో మ్యాచ్.. KKR బోణీ కొడుతుందా?

IPLలో భాగంగా ఇవాళ చెన్నై, కోల్కతా తలపడనున్నాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, ఆడిన 3 మ్యాచుల్లోనూ KKR ఓడింది. దీంతో ఇవాళ్టి మ్యాచులో గెలవాలని భావిస్తోంది. మరోవైపు హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్లో విజయం సాధించి చెన్నై టచ్లోకి వచ్చింది. అదే ఊపుతో విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News April 14, 2026
దేశంలోనే తొలి ‘క్వాంటం’ కేంద్రం.. అమరావతిలో నేడే ప్రారంభం

AP: దేశంలోనే తొలి క్వాంటం కేంద్రం రాష్ట్రంలో ఏర్పాటు కాబోతోంది. అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్(AQRS)ను CM చంద్రబాబు ఇవాళ 2PMకు ప్రారంభించనున్నారు. అమరావతిలోని SRM వర్సిటీలో ఓ ఫెసిలిటీ(1 S), గన్నవరంలోని మేథ టవర్స్లో మరొకటి(1 Q) ఆవిష్కృతం కానున్నాయి. దీంతో <<19081669>>క్వాంటం కంప్యూటర్<<>> హార్డ్వేర్ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం క్వాంటం వ్యాలీకి రానుంది.


