News March 3, 2025

రాంబిల్లి: బాలికపై మేనమామ అత్యాచారం

image

రాంబిల్లి మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై వరుసకు మేనమామ అయిన లాలం రామదాసు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు రాంబిల్లి సీఐ సీహెచ్ నర్సింగరావు ఆదివారం తెలిపారు. బాలికకు నిందితుడు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

Similar News

News November 6, 2025

పెద్దపల్లిలో రోడ్ సేఫ్టీ పనుల స్థల పరిశీలన

image

PDPLబస్టాండ్, అయ్యప్ప టెంపుల్ వద్ద రోడ్ సేఫ్టీ పనులను గురువారం మున్సిపల్, RTC, ట్రాఫిక్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పరిశీలించారు. ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జరిగిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఇచ్చిన సూచనల మేరకు బస్సులు, వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు రోడ్ వెడల్పు, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. RTC అధికారులతో చర్చించి పనులు ప్రారంభిస్తామన్నారు.

News November 6, 2025

గోదావరిఖని: ‘అబ్సెంటిజం సర్క్యూలర్‌పై ఆందోళనలో కార్మిక వర్గం’

image

సింగరేణి యాజమాన్యం అబ్సెంటిజంపై జారీ చేసిన సర్క్యూలర్‌తో కార్మిక వర్గం ఆందోళనకు గురవుతుందని TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అబ్సెంటిజం సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మెడికల్‌ బోర్డు నిర్వహణ త్వరలో చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పోరాటం చేయడం తప్పదని హెచ్చరించారు.

News November 6, 2025

ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు!

image

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించనున్నారు. విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.