News August 19, 2024
రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు, బ్రహ్మకుమారీలు

రక్షాబంధన్ వేడుకను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్లోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు సోమవారం ఉన్నతాధికారులకు రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీలు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సైతం అధికారులకు రాఖీలు కట్టారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్ తదితర అధికారులకు రాఖీలు కట్టి రక్షా బంధన్ ప్రాశస్త్యాన్ని చాటారు.
Similar News
News February 23, 2026
NZB: లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్లు అందజేత

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం కలెక్టరేట్లో సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్లు బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయతీగా సర్వే నివేదికలు అందజేశాయన్నారు.
News February 23, 2026
NZB: డెస్క్ జర్నలిస్ట్లకు అక్రిడిటేషన్ ఇవ్వాలి: DJFT

మీడియాలో పని చేసే ప్రతి డెస్క్ జర్నలిస్ట్కు అక్రిడిటేషన్ ఇవ్వాలని డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (DJFT) నాయకులు కోరారు. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రతి డెస్క్ జర్నలిస్ట్కు ప్రభుత్వం అక్రిడిటేషన్లు ఇవ్వాలని, అక్రిడిటేషన్ జిల్లా కమిటీలో డెస్క్ జర్నలిస్ట్లను నియమించాలని కోరారు. ప్రతి జిల్లాలో 5 అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరారు.
News February 22, 2026
NZB: రెండు వారాల్లో 134 DD కేసులు :CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ 12.10 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.


