News March 4, 2025
రాచర్ల: వృద్ధురాలికి షాక్ ఇచ్చిన కరెంట్ బిల్.!

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగూటిపల్లికి చెందిన పూల వెంకటమ్మ అనే వృద్ధురాలికి కరెంట్ బిల్ షాక్ ఇచ్చింది. ఇంట్లో కేవలం 3 ఫ్యాన్లు, ఓ ఫ్రిడ్జ్, ఓ TV ఉండగా ఏకంగా రూ.10,580 బిల్లు రావడంతో ఆమె అవాక్కయ్యారు. ఫిబ్రవరి నెలలో వారం రోజులపాటు అసలు ఊరిలోనే లేనని, అయినా ఇంత కరెంట్ బిల్లు ఎలా వచ్చిందో తెలియలేదని ఆమె తెలిపారు. గతంలో కూడా మీటర్ సాంకేతిక లోపంతో లక్ష వరకు కరెంట్ బిల్ వచ్చిందని వెల్లడించించారు.
Similar News
News April 22, 2025
కేవీపీఎస్ సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ

కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఆవిష్కరించారు. కేవీపీఎస్ సామాజిక సాంస్కృతిక ఉత్సవాలు-2025లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జీవిత చరిత్రపై ఒంగోలు అంబేడ్కర్ భవనంలో మే 8న, అలాగే మద్దిపాడులోని నటరాజ్ కళాక్షేత్రంలో మే 9న నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. కలెక్టర్ పాల్గొని తిలకించాలని ఆహ్వానించారు.
News April 22, 2025
ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా బిక్షాటన చేస్తుంటుందని స్థానికులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.