News April 18, 2024

రాజంపేటకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు

image

రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఏప్రిల్ 24న వారు రాజంపేటకు రానున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని జిల్లా నేతలు పిలుపునిచ్చారు. అలాగే ఇవాళ రాజంపేట వైసీపీ శ్రేణులు పలువురు TDPలో చేరుతున్నట్లు సమాచారం.

Similar News

News February 21, 2026

కడప జిల్లాలో ఆ కుటుంబం శకం ముగియనుందా?

image

బద్వేల్లో 60 ఏళ్లుగా బిజి వేముల వీరారెడ్డి కుటుంబం పాలకవర్గం లేదా ప్రతిపక్షంలో ఉంటూ వస్తోంది. అయితే బద్వేల్ రిజర్వ్‌డ్‌లోకి వెళ్లడంతో వారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రితేశ్ రెడ్డిని తప్పించి DCCB ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి ఇన్‌ఛార్జ్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే 60 ఏళ్ల తర్వాత ఆ కుటుంబం కథ ముగుస్తుందనే చెప్పవచ్చు.

News February 21, 2026

పుష్పగిరి ఆలయంలో అద్భుత శిల్పాలు

image

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ, శ్రీవైద్యనాథ ఆలయాల్లోని కుడ్యశిల్పాలు విశేషంగా ఉన్నాయని చరిత్రకారుడు రమేష్ తెలిపారు. ఒకే ఇతివృత్తంతో, భిన్న భంగిమల్లో శివుని ఊర్ధ్వ, చతుర తాండవాలు, పార్వతీదేవి కూర్చున్న, నిలుచున్న రూపాలు చెక్కారు. ఒకే శిల్పంలో వృషభం, నందికేశ్వరుడు వేర్వేరుగా ఉండటం ఆనాటి శిల్పుల అద్భుత నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.

News February 21, 2026

మదనపల్లె: కులవర్ధన్ తల్లి కోసం వెతుకులాట

image

మదనపల్లెలో బాలిక హత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. A1 కులవర్ధన్ చనిపోయిన విషయం తెలిసిందే. A2గా అతని తల్లి అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు.