News April 18, 2024
రాజంపేటకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు
రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ రానున్నారు. ఏప్రిల్ 24న వారు రాజంపేటకు రానున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని జిల్లా నేతలు పిలుపునిచ్చారు. అలాగే ఇవాళ రాజంపేట వైసీపీ శ్రేణులు పలువురు TDPలో చేరుతున్నట్లు సమాచారం.
Similar News
News September 30, 2024
కడప జిల్లాలో పేలిన డిటోనేటర్.. కారణం?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వి కొత్తపల్లి గ్రామంలో <<14229836>>డిటోనేటర్ పేలి VRA మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మైనింగ్ కోసం ఉంచిన డిటోనేటర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
News September 30, 2024
కడప జిల్లాలో బాంబు పేలుడు.. VRA మృతి
కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో బాంబులు కలకలం రేపాయి. స్థానిక VRA వి నరసింహులు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేయడంతో VRA మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
News September 30, 2024
కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-24437 ల్యాండ్ లైన్ నంబర్కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.