News May 10, 2024

రాజంపేటలో ఉద్యోగి మృతి

image

రాజంపేట పట్టణంలోని ఎంజీ ఆర్ షాపింగ్ మాల్ వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌పై పొరుగుసేవల ఉద్యోగి ఏనుగుల హరీష్ కుమార్ పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో ట్రాన్స్ ఫార్మర్ పైనే వాలిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, అతనిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందారు. జగన్ సిద్ధం సభ కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తొలగించారు. పునరుద్ధరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News

News January 8, 2026

గండికోట ఉత్సవాలకు సింగర్ మంగ్లీ, రామ్ మిర్యాల, శివమణి రాక

image

జమ్మలమడుగు మండలంలోని గండికోటలో ఈ నెల 11 నుంచి 13 వరకు గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఉత్సవాలకు మొదటి రోజు సింగర్ మంగ్లీ, రెండవ రోజు రామ్ మిర్యాల, మూడవరోజు శివమణి ఈ ఉత్సవాలలో అలరించనున్నారు. చివరిసారిగా 2020లో వైభంగా జరిగాయి. దీంతో అధికారులు ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు. ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News January 8, 2026

మరో భారీ ఈవెంట్‌‌కు సిద్ధమవుతున్న జమ్మలమడుగు

image

జమ్మలమడుగు.. ఇక్కడ రాజకీయ రణరంగమే కాదు, రాష్ట్ర, జాతీయ స్థాయి ఈవెంట్లను సైతం చేయగల సత్తా ఉన్న ప్రాంతం అని నిరూపిస్తోంది. ఈనెల 5 నుంచి ప్రారంభమైన 69వ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ పోటీలను సమర్థవంతంగా జమ్మలమడుగులోని అధికారులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ నెల 11 నుంచి 13 వరకు గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చివరిసారిగా 2020లో వైభంగా జరిగాయి. దీంతో అధికారులు ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు.

News January 8, 2026

ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడుతో ఏపీ ఫైట్

image

అండర్-14 బాలికల జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ఫ్రీ క్వార్టర్ ఫైనల్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు గెలిస్తే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జట్టు సభ్యులు కచ్చితంగా విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక మ్యాచ్ ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
>> ALL THE BEST TEAM AP