News December 19, 2025

రాజంపేటలో CM హామీ ఇచ్చిన చోటే..!

image

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చిన చోటే శుక్రవారం ప్రజాగర్జన నిర్వహించడానికి జేఏసీ రంగం సిద్ధం చేసింది. జిల్లా కేంద్రం విషయంలో రాజంపేటకు అన్యాయం జరిగిందని, తాము న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అదే ప్రాంతంలో నిర్వహించనున్న గర్జన సభకు కోడూరు, రాజంపేట నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలు, నేతలు తరలి రానున్నారు.

Similar News

News December 22, 2025

యూరియా బుకింగ్ ఇక యాప్‌తో మాత్రమే

image

TG: యూరియా పొందాలంటే రైతులు నేటి నుంచి Fertilizer Booking Appతో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈనెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి రాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇదే విధానం అమలుకానుంది. పారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే యూరియా పంపిణీకి ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?, ఏ పంటకు ఎన్ని బస్తాలు ఇస్తారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 22, 2025

YS జగన్‌ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

image

అనంతపురం జిల్లాలో మాజీ సీఎం YS జగన్ బర్త్ డే సంబరాలు చర్చనీయాంశంగా మారాయి. విడపనకల్లులో వైసీపీ నేతలు వేట కొడవళ్లతో పొట్టేళ్లను నరికి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు. కనగానపల్లి మండలం భానుకోటలో సైతనం ఇదే తరహా సంబరాలు చేసుకున్నారు. ఫ్యాక్షన్‌ గ్రామమైన భానుకోటలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2029లో రప్పా రప్పా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పొట్టేళ్లను బలితీయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

News December 22, 2025

ఆసుపత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం

image

TG: ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆసుపత్రి వార్డుల్లో రోగుల సహాయకులు భోజనం చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిషేధం విధించింది. క్యాంటీన్లలోనే ఆహారం తినేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరింది. వార్డులో ఆహారం తిని పారవేయడంతో ఎలుకల బెడద పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.