News September 21, 2024
రాజంపేట: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సదస్సులో పాల్గొన్న అభిషేక్ రెడ్డి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల మధ్య గ్లోబల్ లర్నింగ్ అనుభవాలను పెంచుకోవడమే లక్ష్యంగా రాజంపేట అన్నమాచార్య విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ అభిషేక్ రెడ్డి ఈ నెల 18, 19 తేదీలలో ఫ్రాన్స్ పర్యటన చేశారు. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (EAIE) సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు ఆయనకు “ఫ్లాగ్ బేరర్ ఆఫ్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్” అనే సర్టిఫికేట్ అందజేశారు.
Similar News
News September 20, 2024
కడప: గంజాయి విక్రయాలపై దాడులు
కడపలో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. మాసాపేటలోని హిందూ స్మశాన వాటిక సమీపంలో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. వీరి వద్ద నుంచి 4.1 కేజీల గంజాయి, 1000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
News September 20, 2024
కడప జిల్లాకు పవర్ లిఫ్టింగ్లో పతకాల పంట
ఆర్కే వ్యాలీ IIIT పవర్ లిఫ్టింగ్ టీం కడప జిల్లా తరఫున ఇటీవల అమలాపురంలో జరిగిన ఏపీ 11వ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. టీమ్ చాంపియన్షిప్ సబ్ జూనియర్ విభాగంలో గర్ల్స్ ఫస్ట్ ప్లేస్, బాయ్స్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు. మొత్తం 8 బంగారు, 7 రజిత, 1 కాంస్య పతకాలు సాధించారు. ఇందులో అమ్మాయిలు 6 బంగారు, 4 రజిత, 1 కాంస్య, అబ్బాయిలు 2 బంగారు, 3 రజిత పతకాలు సాధించారు.
News September 20, 2024
బ్రోకర్లు వైసీపీని వీడటం మంచిదే: మిథున్ రెడ్డి
వైసీపీలో ప్రస్తుతం రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్రోకర్లు, స్క్రాప్ లాంటి నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం మనకి చాలా మంచిది. ఇప్పుడు ఉండే నాయకులు, కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే మనకు కచ్చితంగా పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా అందరం పనిచేద్దాం’ అని మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు.