News March 29, 2024

రాజంపేట: తమ నేతకు టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం

image

రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడుకు రాజంపేట టీడీపీ టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు రాజంపేటలో భవనంపై నుంచి దూకుతానని కొద్దిసేపు హల్చల్ చేశారు. తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. టీడీపీ నేతలు కొందరు హుటాహుటిన భవనం పైకెక్కి మందా శీనును సముదాయించి కిందికి దించారు.

Similar News

News July 5, 2024

ఢిల్లీలో తప్పిపోయిన బాలిక ముద్దనూరులో ప్రత్యక్షం

image

ఢిల్లీలో కనిపించకుండా పోయిన బాలిక ముద్దనూరులో ప్రత్యక్షమైంది. సీఐ దస్తగిరి తెలిపిన వివరాల ప్రకారం.. 15 ఏళ్ల మొహంతి కాంతు ఢిల్లీ నుంచి పారిపోయి ముద్దనూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు సీఐ సహాయం కోరారు. దాదాపు 2 గంటల సర్చ్ ఆపరేషన్ తర్వాత ఆ అమ్మాయితో పాటు వచ్చిన మహమ్మద్ రెహ్మాన్‌ల జాడ కనుక్కొని ఢిల్లీ పోలీసులకు అప్పచెప్పినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

గువ్వలచెరువు ఘాట్ సొరంగ మార్గానికి రూ.1000 కోట్లు

image

కడప – రాయచోటి మార్గమధ్యలోని గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనదారుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ప్రమాదకరంగా ఉండే ఈ ఘాట్‌కు ప్రత్యామ్నాయంగా.. ఆ కొండకు సొరంగం తవ్వి, నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్రం రూ.1,000 కోట్లు నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 14 జాతీయ రహదారులకు రూ.4,744 కోట్లతో 2024-25 వార్షిక ప్రణాళికకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

News July 5, 2024

రేపు కడపకు రానున్న YS జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.