News March 24, 2024

రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

image

రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అదిష్టానం ప్రకటించింది. తాజాగా దేశవ్యాప్తంగా వెలువడిన బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాజంపేట అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన విజయం కోసం మూడు పార్టీల నేతలు పనిచేయాలన్నారు.

Similar News

News September 4, 2025

9న కడపలో గండికోట ముంపు వాసుల సమీక్ష.!

image

గండికోట ముంపు వాసుల సమీక్ష సమావేశం ఈనెల 9న కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. సమావేశంలో కొండాపురం మండలంలోని ఓవన్నపేట, చౌటపల్లి, బొమ్మపల్లి మరో 11 గ్రామాల గృహాల పునరావాస పరిహారంపై చర్చించనున్నారు. జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, అధికారులు పాల్గొంటారు. వీరితోపాటు కొంతమంది ముంపు బాధితులు వెళ్లనున్నారు.

News September 3, 2025

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా కడప జిల్లా నుంచి ముగ్గురు

image

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను  ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు అర్హులుగా నిలిచారు. పెండ్లిమర్రి మండలం ఎగువపల్లె హైస్కూల్‌కు చెందిన హిందీ టీచర్ ఖాదీర్, కాశినాయన మండలం రెడ్డికొటాల MPUPS, SGT బి.పరిమళ జ్యోతి, ప్రొద్దుటూరు పరిధిలోని లింగారెడ్డిపల్లె MPPS, SGT షేక్ జవహర్ మునీర్‌లు అవార్డుకు ఎంపికయ్యారు.

News September 3, 2025

కడప: చిన్నారిని అంగన్వాడీ స్కూల్లో ఉంచి తాళం వేసిన టీచర్

image

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం PCపల్లి అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థినిని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన బుధవారం జరిగింది. హరికృష్ణ అనే విద్యార్థి ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వచ్చాడు. పొలం పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థి ఇంటికి రాకపోవడంతో వెతికారు. చివరికి అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టి చూడగా బాబు లోపల సృహతప్పి పడిపోయి ఉన్నాడు. ఈ ఘటనపై టీచర్ చంద్రకళను ప్రశ్నించగా సమాదానం లేదన్నారు.