News May 3, 2024

రాజంపేట యువతతో రేపు నారా లోకేశ్ ముఖాముఖి

image

18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు గల రాజంపేట యువతీ, యువకులతో శనివారం నారా లోకేశ్ స్వయంగా మాట్లాడుతారని రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ సుగవాసి బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. రాజంపేట మండలం కూచివారిపల్లి పంచాయతీ విద్యానగర్‌లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు లోకేశ్ ముఖాముఖి ఉంటుందని తెలిపారు. యువతీ యువకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

Similar News

News September 9, 2025

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు: కలెక్టర్

image

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో 3,71,400 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 4 నెలలు వయస్సు దాటిన పశువులకు టీకాలు వేయించాలన్నారు.

News September 9, 2025

కడప: ఉల్లి కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

image

ఉల్లి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం యూరియా సరఫరా, ఉల్లి పంట కొనుగోలుపై CM, CSలతో VC సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉల్లి కొనుగోలు కోసం కమలాపురం, మైదుకూరులలో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 4 నుంచి ఉల్లిపంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. యూరియాపై రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

News September 8, 2025

కడప జిల్లాలో 11,628 ఎకరాల్లో ఉల్లి సాగు

image

కడప జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 11,628 ఎకరాల్లో రైతులు ఉల్లిపంట సాగు చేశారు. వీరపునాయునిపల్లె, మైదుకూరు, దువ్వూరు, వేముల, తొండూరు, వేంపల్లి, ముద్దనూరు మండలాల్లో ఎక్కువగా ఉల్లిపంటను సాగు చేశారు. ఈనెల 10కి 655 ఎకరాల్లో, 17కి 1,265, 24కి 3,674, అక్టోబర్ 1కి 3,206, అక్టోబర్ 7కి 2,828 ఎకరాల్లో ఉల్లి పంట కోతకు వస్తుందని ఉద్యానశాఖ DD రవిచంద్ర తెలిపారు.