News April 25, 2024
రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చిన చంద్రబాబు

రాజంపేట ప్రజాగళం సభలో TDP అధినేత చంద్రబాబు రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చారు. ‘రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడం. అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛా ప్రాజెక్టులు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడం. మాచుపల్లి బ్రిడ్జీ, ఓబిలి-టంగుటూరు బ్రిడ్జీని పూర్తి చేయడం. జర్రికోట ప్రాజెక్ట్ నుంచి సుండుపల్లికి తాగునీరు, సాగునీరు ఇవ్వడం. గాలేరు, నగరి కాలువ పనులను పూర్తి చేయడం తమ బాధ్యత’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Similar News
News May 8, 2025
పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News May 8, 2025
పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News May 8, 2025
కడప: రిమ్స్ ప్రిన్సిపల్గా డాక్టర్ జమున

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.