News November 18, 2024

రాజకీయ లబ్ధి కోసమే YCPపై ఆరోపణలు: బొత్స

image

AP: వైసీపీ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిందన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. శాంతిభద్రతలపై Dy.CM పవన్ ఆందోళన వ్యక్తం చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనిత వ్యాఖ్యలకు తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు దమ్ము, ధైర్యం అంటూ మంత్రి మాట్లాడటం సరికాదని మండలి ఛైర్మన్ మోషన్ రాజు అన్నారు.

Similar News

News February 24, 2026

చిన్నప్పటి బరువు.. పెద్దయ్యాక గుండెపోటు?

image

పదేళ్ల వయసులో ఉండే బాడీ మాస్ ఇండెక్స్, అలాగే 1 నుంచి 18 ఏళ్ల మధ్య పెరిగే బరువు తీరు భవిష్యత్తులో షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లల బరువులో వచ్చే మార్పుల్లో 25% కేవలం జీన్స్ వల్లే జరుగుతాయని ఈ స్టడీ చెబుతోంది. చిన్నప్పుడు బరువు పెరగడం ఊబకాయం కిందకు రాదని, కానీ ఎదుగుదల వేగాన్ని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

News February 24, 2026

అవన్నీ ఫేక్.. తన రెండో పెళ్లిపై వస్తున్న రూమర్లకు ధవన్ చెక్!

image

రెండో పెళ్లి తర్వాత తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని శిఖర్ ధవన్ ఖండించారు. ‘నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరని నా మాజీ భార్య శాపనార్థాలు పెట్టిందని, దానికి బదులుగానే మళ్లీ మ్యారేజ్ చేసుకున్నానని’ SMలో వస్తున్న రూమర్స్‌లో నిజం లేదని ధవన్ స్పష్టం చేశారు. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయొద్దని, తానెప్పుడూ పాజిటివిటీని కోరుకుంటానన్నారు. సోఫీ షైన్‌తో తన కొత్త లైఫ్‌ను సంతోషంగా మొదలుపెట్టినట్లు వెల్లడించారు.

News February 24, 2026

ఇంట్లో గవ్వలు ఎందుకు ఉండాలి?

image

గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సముద్రం నుంచి ఉద్భవించిన వీటిని లక్ష్మీదేవికి తోబుట్టువుగా చెబుతారు. ఇవి ఇంట్లో ఉంటే మహాలక్ష్మి కటాక్షం కలిగి, ఆర్థిక ఇబ్బందులు పోతాయని పండితులు చెబుతున్నారు. ‘పసుపు రంగు గవ్వలు పూజా గదిలో, గల్లా పెట్టెలో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది. గవ్వలకు ప్రతికూల శక్తిని హరించే గుణం ఉంది. అందుకే ఇంటి గుమ్మానికి గవ్వల తోరణం కట్టాలి. దిష్టి దోషాలు పోతాయి’ అంటున్నారు.