News October 9, 2025
రాజగోపాల్ పేట: ముగిసిన టీజీఈపీసెట్ కౌన్సిలింగ్

ఈనెల 7న ప్రారంభమైన టీజీఈపీసెట్(బైపిసి)-2025 కౌన్సిలింగ్ నేటితో ముగిసిందని రాజగోపాల్ పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గోవర్ధన్ తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం 700 మంది విద్యార్థులు కౌన్సిలింగ్లో పాల్గొన్నారని తెలిపారు. వారి ధ్రువపత్రాలు పరిశీలన చేసి వెబ్ ఆప్షన్లకు సంబంధించిన సూచనలు ఇచ్చామని అన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో అభినవ్, రాజు, రామకృష్ణ, షహబాజ్, విజయకుమార్ పాల్గొన్నారు.
Similar News
News October 9, 2025
APPSC పరీక్షల ఫలితాలు విడుదల

AP: వివిధ డిపార్టుమెంటు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. అసిస్టెంటు ట్రైబల్ ఆఫీసర్, అసిస్టెంటు కెమిస్ట్ (గ్రౌండ్ వాటర్), లైబ్రేరియన్స్ (మెడికల్), ఫిషరీస్ డెవలప్మెంటు ఆఫీసర్ (ఫిషరీస్) పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ <
News October 9, 2025
CM నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మ. 2.25 గంటలకు ఆయన కోవూరు(M) పోతిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా మైపాడు గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ను ప్రారంభిస్తారు. షాపు ఓనర్లతో ఫొటోషూట్ అనంతరం 3.05 నిముషాలకు తిరిగి పోతిరెడ్డి పాలెం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఈదగాలి వెళ్తారు.
News October 9, 2025
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు: మహేశ్ కుమార్

TG: స్థానిక ఎన్నికలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. GO-9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు. దీంతో HCలో పోరాడడం, స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి.