News August 17, 2025

రాజధానిలో మూడు రిజర్వాయర్ల నిర్మాణం.. వరదకు అడ్డుకట్ట!

image

భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం జలమయం కావడం ప్రధాన సమస్యగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం నీరుకొండ (0.4 టీఎంసీ), కృష్ణాయపాలెం (0.1 టీఎంసీ), శాఖమూరు (0.01 టీఎంసీ)లతో మూడు రిజర్వాయర్లను రూ. 1200-1500 కోట్లతో నిర్మిస్తున్నారు. 8 కి.మీ. గ్రావిటీ కెనాల్‌తో పాటు 48.3 కి.మీ. కాలువల వెడల్పు, పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే అమరావతిలో నీరు నిలబడదని అధికారులు చెబుతున్నారు.

Similar News

News August 17, 2025

సంగారెడ్డి: 20 నుంచి మండల స్థాయి పోటీలు: డీఈఓ

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి పది రోజుల పాటు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో ఖోఖో, వాలీబాల్, కబడ్డీ మాత్రమే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

News August 17, 2025

గుడ్లూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గుడ్లూరు మండలం చేవూరు గ్రామ పరిధిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. రామదూత ఆశ్రమం ఎదురుగా ఉన్న శేషమ్మ సత్రం వద్ద నేల బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు గుడ్లూరు పోలీసు స్టేషన్ లేదా 91211 02206 నంబరుకు సంప్రదించాలని పోలీసులు కోరారు.

News August 17, 2025

భద్రాద్రి: నేడు మంత్రి పొంగులేటి పర్యటన

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం నుంచి ఖమ్మంలో జిల్లాలో మొదలయ్యే మంత్రి పర్యటన కూసుమంచి, నేలకొండపల్లి మండలాలతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మంలో కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, లక్ష్మిదేవిపల్లి మండలు, కొత్తగూడెం కార్పొరేషన్లలో జరిగేపలు ప్రైవేట్ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు.